Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్పల్లి
త్వరలో జరగనున్న విజయదశమి వేడుకల్లో భాగంగా బతుకమ్మ వేడుకల కోసం ప్రభుత్వం నుండి అందిస్తున్న బతుకమ్మ చీరలు శనివారం రాత్రి మండలానికి చేరగా ఆదివారం గ్రామాలకు ఎంపీడీఓ సాంబశివరావు ప్రత్యేక వాహనం ద్వారా పంపిణీ చేశారు. మండల వ్యాప్తంగా 17263 చీరలకు 1080 చీరలు మాత్రమే మండలానికి చేరాయి. ఇంకా 7082 చీరలు రావాల్సి ఉంది. నేడు మండల పరిధిలోని యడవల్లి, పోతినేనిపల్లె, తొండల్వాయి, జివ్విగూడం గ్రామాల్లో చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ఎంపీడీఓ సాంబశివరావు పేర్కొన్నారు.
పనుల పరిశీలన
ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా మండల కేంద్రంలో జరుగుతున్న పనులను ఎంపీడీఓ సాంబశివరావు ఆదివారం పరిశీలించారు. జేసీబీ ద్వారా జరుగుతున్న పనుల్లో వేగాన్ని పెంచాలని సూచించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి రవికుమార్, సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి ఉన్నారు.