Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని జాగృతి నియోజకవర్గ ఇన్చార్జి టిజి.లింగంగౌడ్ కోరారు. ఆదివారం పట్టణంలోని పద్మశాలీ భవనంలో ఆ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాగృతి బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. ఈ నెల 25న నల్లగొండలో జరిగే సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జాగృతి జిల్లా కోకన్వీనర్ కొండేటి నివాస్, యువజన విభాగం జిల్లా కన్వీనర్ బెల్లి సైదులు, ప్రతినిధులు బి.నిరంజన్, మందడి జాన్రెడ్డి, రాచకొండ గోపి, పరమేశ్, అనిత, సునీత, సంధ్య పాల్గొన్నారు.