Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు నల్లా చిన వెంకటయ్య అన్నారు. స్థానిక కార్యాలయంలో నిర్వహించిన టైలర్స్, వర్కర్స్ యూనియన్ పట్టణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, డబుల్బెడ్రూమ్ ఇండ్లస్థలాలు, కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా చిన వెంకటయ్య, కార్యదర్శిగా నల్లా సైదులు, ఉపాధ్యక్షులుగా ఫయాజ్, గంగాధర్, సహాయ కార్యదర్శిగా రాంబాబు, కోశాధికారిగా చంద్రమౌళితో పాటు మరో 18 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎం. శ్రీను, రసూల్, బి. శ్రీను, నాగరాజు, బలరాం, హరికృష్ణ, గోవర్థన్, కొండల్, శంకర్ పాల్గొన్నారు.