Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేములపల్లి :గ్రామాల మధ్య ఉన్న అంతర్గత రోడ్లకు మరమ్మతులు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పాదూరి శశిధర్రెడ్డి అన్నారు.విమర్శించారు. ఆదివారం స్థానికంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం 30 రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టే కార్యక్రమాలు గ్రామంలో నిరంతరం చేపట్టే ప్రక్రియ అన్నారు.బీమారం-సూర్యాపేట రహదారి పనులు ముందుకెళ్లక ఎంతోమంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా.. అసెంబ్లీలో కనీసం వాటిపై చర్చించలేదన్నారు.ఈ సమావేశంలో నాయకులు రొండి శ్రీనివాస్, రెమడాల పరుశురాములు, పతాని శ్రీను, వెంకట్రెడ్డి, సైదులు పాల్గొన్నారు.