Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కలెక్టరేట్
రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివద్ధి, పరిశ్రమ లు, వాణిజ్య, ఐటిఎస్ శాఖ మంత్రి కె.తారక రామారావు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి జిల్లా కేంద్రానికి రానున్నట్టు కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జి.జగదీశ్రెడ్డితో కలిసి బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభిం చనున్నట్టు తెలిపారు. ఆదివారం ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో సభా వేదిక ఏర్పాట్లు, సిటింగ్ ఏర్పాట్లు, మహిళలకు చీరల పంపిణీ, భోజన ఏర్పాట్లు, ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాట్లపై అధికారులతో చర్చించి సూచనలు చేశారు. వేదిక, తాగు నీరు, భోజన ఏర్పాట్లపై మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు, డీఆర్డీఓలు పక్కాగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివద్ధి అధికారి శేఖర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దేవ్ సింగ్, ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఈఈ కందుకూరి వెంకటేశ్వర్లు, డీపీఆర్ఓ శ్రీనివాస్, చేనేత,జౌళి శాఖ సహాయ సంచాలకులు జహీరొద్దీన్, పౌర సరఫరాల శాఖ డీఎం.నాగేశ్వర్ రావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ బాషా, తహశీల్దార్ దామోదర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ వి.చంద్రశేఖర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉదయాదిత్య భవన్లో మున్సిపాలిటీల సమీక్ష సమావేశం ఏర్పాట్లపై పరిశీలించి కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి మోతీలాల్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్మేనేజర్ కోటేశ్వర రావు, డిసిఓ.శ్రీనివాస మూర్తితో చర్చించి సూచనలు చేశారు.