Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.రాములు
నవతెలంగాణ-కలెక్టరేట్
ఉద్యోగుల ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు ఐఆర్, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.రాములు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్యాకేజి డైరెక్ట్గా పీఆర్సీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ అవలంబించే ఉద్యోగ వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి రానున్న రోజులలో ఐక్యఉద్యమాల ద్వారానే ఉమ్మడి ఉద్యమాన్ని నిర్మించి సమస్యలు పరిష్కరించు కుందామని పిలుపునిచ్చారు. విద్యాహక్కు చట్టం దేశం, రాష్ట్రంలో నామమాత్రంగా కొనసాగిం దన్నారు. దీంతో దేశంలో నిరక్షరాస్యత పెద్దగా తగ్గలేదని విద్యారంగానికి జీడీపీలో 6శాతం పెంచకుండా కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు విద్యారంగానికి పెంచకుండా సంపూర్ణ అక్షరాస్యత సాధించలేమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి జి.నాగమణి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల సైదులు, రాష్ట్ర ఆడిట్కమిటీ సభ్యులు కె.యాకయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్.సరళ, పి.లక్పతినాయక్, జిల్లా కోశాధికారి పి.వెంకటేశం, జిల్లా కార్యదర్శులు ఎల్.సత్య నారాయణ, సిహెచ్.రామలింగయ్య, గేర నర్సింహ, జయలక్ష్మీ, అరుణ, విజయలక్ష్మీ, పి.రాజశేఖర్, ఎం.శ్రీనివాసరెడ్డి, కె.మల్లేశం, లచ్చయ్య, గోవర్దన్రావు, విద్యాసాగర్రెడ్డి, ఖాదర్ పాల్గొన్నారు.