Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీకాంత్
నవతెలంగాణ-కలెక్టరేట్
రవాణరంగాన్ని కార్పొరేట్ శక్తుల అప్పజెప్పి, కార్మికులపై పన్నుల భారాలు మోపే ఎంవీయాక్టు చట్టవరణ బిల్లు 2019ను వెంటనే ఉపసంహరించే వరకు రవాణ రంగ కార్మికులు ఉద్యమించాలని తెలంగాణ పబ్లిక్, ప్రయివేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీకాంత్ పిలుపునిచ్చారు. స్థానిక దొడ్డి కొమరయ్య భవన్లో ఆటో ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ జిల్లా జనరల్బాడీ సమావేశం ఐ.ఏడుకొండలు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో వ్యవసాయరంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న జీడీపీ 6శాతం వాటా ఉన్న రవాణ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెపేందుకే ఎంవీయాక్టు చట్ట సవరణలు చేశారని విమర్శించారు. పార్లమెంట, రాజ్యసభలలో టీఆర్ఎస్ సభ్యులు మద్దతు ఇచ్చి ఇప్పుడు అమలు చేయమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.ఇప్పటికైనా అసెంబ్లీ సెక్షన్స్లోనే ఎంవీయాక్టు అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. రవాణరంగ కార్మికుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సిహెచ్.లక్ష్మీనారా యణ మాట్లాడుతూ కార్మికులు ఐక్యంగా పోరాడాలని కోరారు. ఆర్టీఏ, పోలీసుల వేధింపులు ఆపాలని కోరారు. ఈ సమావేశంలో ఆ సంఘం నాయకులు మహ్మద్బాయి, పి.నాగేశ్, గోపి, ప్రసాద్, బి.యాదయ్య, స్వామి, వెంకన్న, బి.చిన్న, కోటయ్య, రమేశ్ పాల్గొన్నారు.