Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎండీతో మాట్లాడుతానని హామీ
నవతెలంగాణ-చింతపల్లి
సమాన పనికి సమాన వేతనం కల్పించాలని హెచ్ఎండబ్య్లూఎస్ కార్మికులు రెండ్రోజులుగా సమ్మె చేపడుతున్నారు. సమ్మెలో భాగంగా శనివారం కార్మికులు మండలంలోని మాల్ రిజర్వాయర్ వద్ద వాటర్సిగల్ టవర్ ఎక్కి ఆందోళన చేపట్టారు. పోలీసులు, అధికారులు నచ్చచెప్పినప్పటికీ వినలేదు. ఆదివారం ఉదయం వరకూ కూడా కార్మికులు అలాగే వాటర్సిగల్టవర్పై ఎక్కి నిరసన తెలిపారు. హైదరాబాద్కు నీటి సరఫరా చేసే మూడు పంపింగ్ బటన్లను ఆన్ చేయకుండా నీటి విడుదల చేయలేదు. హుటాహుటిన హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫోర్స్ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, దేవరకొండ డీఎస్పీ మహేశ్వర్, నాంపల్లి సీఐ గౌరీనాయుడు, చింతపల్లి ఎస్సై నందులాల్ రంగప్రవేశం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. హెచ్ఎండబ్య్లూఎస్లో పని చేస్తున్న డీటీ ప్రవీణ్కుమార్ అధికారులతో మాట్లాడి ఎండీతో చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరిస్తానని హామీనివ్వడంతో వాటర్సిగల్ టవర్ నుంచి ఉదయం 11 గంటల సమయంలో కిందకు దిగారు. దీంతో హెచ్ఎండబ్య్లూఎస్లో పని చేస్తున్న 60 మంది కార్మికులు సమ్మెను విరమించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో వెట్టి చేస్తున్నామని, పేస్కేల్ ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, విద్యార్హతలను బట్టి ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.వీరికి సీపీఐ జిల్లా కార్యదర్శి పల్లా నర్సింహారెడ్డి, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు చల్లం పాండురంగారావు, సీఐటీయూ నాయకులు, ఎంపీపీ భర్త కొండూరు పవన్, ఊరె లక్ష్మణ్, మైనార్టీ సెల్ నాయకులు ఖలీల్ సంఘీభావం తెలిపారు.