Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
ఈ నెల 20 నుంచి జరుగనున్న శివరాత్రి వేడుకలకు పిల్లలమర్రి గ్రామంలో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దేవాల యం ప్రాంగణంలో పారిశుధ్య పనులతో పాటు దేవాలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. అంతేకాకుండా జాతీయ రహదారి నుంచి పిల్లలమర్రి గ్రామం వరకు 2.8కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా దెబ్బతినగా విషయాన్ని గ్రామస్థులు మంత్రి జగదీశ్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా రూ. 30 లక్షల వ్యయంతో నిధులు మంజూరు చేయించగా మంగళవారం పనులు మొదలయ్యాయి. దేవాలయ కమిటీ చైర్మెన్ గడ్డం ధనలక్ష్మి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పనులు కొనసాగుతుండగా మున్సిపల్ కమిషనర్ రామాంజులురెడ్డి పనులను పర్యవేక్షిస్తున్నారు.