Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
తిరుమలగిరిలోనే అనంతారం రోడ్డులో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రంలో దళారుల ప్రమేయం అధికంగా ఉంటుందని ఆరోపిస్తూ రైతులుమంగళవారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ పత్తి కొనుగోలు చేసే దళారులు రైతుల నుంచి గ్రామాలలో పత్తిని కొనుగోలుచేసి సీసీఐ కొనుగోలులో పైరవీ చేసుకొని ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముతున్నారని ఆరోపించారు. దళారుల పత్తి ఎలా ఉన్నా కూడా సీసీఐ కొనుగోలు కేంద్రం అధికారులు తీసుకుంటున్నారని ఆరోపించారు. రైతుల పత్తి మంచిగున్నా నాణ్యతా ప్రమాణాలు లేవని అనేకమైన ఆంక్షలు విధిస్తూ పత్తి కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. పత్తి కొనుగోలు చేసే మధ్య దళారీలు గ్రామాలలో రైతుల నుండి రూ. 3500 లు నుంచి రూ.4000లు వరకు కొనుగోలు చేసి సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి అధికారులకు ఎంతోకొంత ముట్టజెప్పి ప్రభుత్వమద్దతు రూ.5550లు పొందుతున్నారని చెప్పారు. ఉన్నతాధికారులు కొనుగోలు కేంద్రం పైన విచారణ జరిపి మధ్య దళారీల ప్రమేయం.లేకుండా చూడాలని,రైతుల పత్తిని కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.