Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
మార్కెట్ తీసుకొచ్చిన కందులను అన్నింటిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు మార్కెట్ యార్డు ఎదుట సూర్యాపేట-జనగాం రోడ్డుపై మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు రైతులు మాట్లాడుతూ వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై రైతుల కందులు కొనుగోలు చేయకుండా నాణ్యతా ప్రమాణాలు పేరుతో తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. ఆన్లైన్లో పేర్లు ఉన్న వారి కందులు మాత్రమే కొనుగోలు చేస్తామని ఐకేపీ నిర్వాహకులు చెప్తున్నారని తెలిపారు.ఈ నెల 14న ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ మద్దతు ధర రూ5800లు వస్తుందని మార్కెట్ ప్రారంభమైన మరుసటి రోజునే కందులు తీసుకొచ్చామని చెప్పారు. మూడు రోజులుగా మార్కెట్లో పడిగాపులు కాస్తున్నా కందులను కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. రైతుల పేర్లు ఆన్లైన్లో సక్రమంగా లేవన్నారు. మార్కెట్ తీసుకువచ్చిన అందరి రైతుల కందులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.