Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంస్థాన్నారాయణపురం
మండలంలొని రాచకొండ గుట్టలో మత సామరస్యానికి ప్రతీకగా జరిగే హజరత్ గాలీభ్ షహీద్ ఉర్సు ఉత్సవాలు నేడు ప్రారంభం కానున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఉర్సు ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఉర్సు ఉత్సవాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా మహబూద్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నుండి హిందూ,ముస్లీం భక్తులు వేల సంఖ్యలో పాల్గొంటారు. హజరత్ గాలీభ్ షహీద్ దర్గా వద్ద కొబ్బరి కాయలు కొట్టి దట్టీలు కట్టి మొక్కులు చెల్లించుకుంటారు. వనభోజనాలు చేస్తారు. ఈ ఉర్సులో పిల్లను పెద్దలను ఆకర్శించే విధంగా ఎగ్జిబీషన్ ఏర్పాటు చేస్తారు. ముస్లీం కళాకారులు 'కవాళి'ఏర్పాటు చేస్తారు. కవాళి ఉర్సుకు ప్రత్యేక ఆకర్శనగా నిలుస్తుంది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఔట్పోస్టు పోలీస్స్టేషన్ ఏర్పాటు చేస్తారు. ఉర్సుకు పోయే భక్తుల సౌకర్యార్దం ఇబ్రహింపట్నం ఆర్టీసి డిపో వారు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తారు. నారాయణపురం మండల కేంద్రం నుండి ఆర్టీసి బస్సుతో పాటు, ప్రయివేట్ వాహనాల సౌర్యం ఉంటుంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంతోపాటు, ఆరుట్ల గ్రామం నుండి ఆర్టీసి బస్సులతోపాటు ప్రయివేల్ వాహనాల సౌకర్యం ఉంటుంది.