Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాలకవీడు:జర్నలిస్టు తీన్మార్ మల్లన్నపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాల ధనంజయ నాయుడు తెలిపారు. పాలకవీడు మండలంలో విలేకర్లతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన దాడి చేస్తారా..? అనిప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తులపై భౌతిక దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. జర్నలిస్టులపై దాడులు చేస్తున్న టీఆర్ఎస్ వారు ప్రజలకు ఎలాంటి సంకేతాలిస్తున్నారని ప్రశ్నించారు. ఆర్మూర్ పోలీస్స్టేషన్లో తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేసి పోలీసులు నోటీసులు పంపిస్తే సమాధానం చెప్పేందుకు వెళ్లిన మల్లన్నపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశారని, దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా తీన్మార్ మల్లన్నను అరెస్టు చేశారని, ప్రజలకు, ప్రభుత్వాలకు వారధులుగా ఉండే జర్నలిస్టులను అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు.ఈ సమావేశంలో ముళ్ళ జానయ్య, బోయబోయిన శ్రీనివాస్, మధునాయక్, గొట్టె నాగయ్య, గొట్టె సైదులు పాల్గొన్నారు.