Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్పల్లి
ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ పై అవగాహన పెంచుకొని తగు జాగ్రత్తలతో కరోనా వైరస్ తరిమి వేద్దామని ఎంపీపీ సుధీరెడ్డి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు మంగళవారం మండల పరిధిలోని అక్కినపల్లి నార్కట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అభివద్ధి కమిటీ సమావేశంలో మాట్లాడారు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి శానిటైజర్ ఉపయోగిస్తూ భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు. అవసరాల మేరకే ఇంటి నుంచి బయటికి వెళ్లాలని సూచించారు. వైద్యులు సూచించిన సలహాల ప్రకారం ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా ఉప వైద్యాధికారి అరుంధతి రెడ్డి మండల వైద్య అధికారులు పల్లవి ప్రవీణ్ రెడ్డి సర్పంచులు మాదాసు చంద్రశేఖర్ దూదిమెట్ల స్రవంతి దాసరి రాజు ఎంపిటిసిలు చిరుమర్తి యాదయ్య మాజీ ఎంపిటిసి కుమారస్వామి క్షేత్ర స్థాయి వైద్య అధికారులు బడుగు శ్రీరాములు ఆంజనేయులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.