Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవూర
నల్లగొండ జిల్లాలోని 31 మండలాల్లోని 844 గ్రామపంచాయతీల్లో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చే లక్ష్యంగా ప్రభుత్వం మిషన్ భగీరథ పనులు చేపట్టింది. అధికారుల అలసత్వం, గుత్తేదారుల నిర్లక్ష్యం కారణంగా పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపిస్తున్నాయి. పనులు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. జిల్లాలో 1536 ట్యాంకులు పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటి వరకూ 1300 మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన4మిగతా 3లో...
నత్తనడకన భగీరథ
236లో 136 నిర్మాణ దశలో ఉండగా 100 ట్యాంకులు ప్లాస్టింగ్ దశలో ఉన్నాయి. ఇందులో 780 ట్యాంకులకు కనెక్షన్లు ఇచ్చారు. జిల్లాలోని పలు నియోజక వర్గాలుగా పరిశీలిస్తే దేవరకొండలో 414 ట్యాంకులకు గాను 300, సాగర్ నియోజకవర్గంలో 273 ట్యాంకులకు గాను 235, నల్లగొండలో 135కు గాను 120, మునుగోడులో 169కి 152 మాత్రమే పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 4448.25 కిలోమీటర్ల మేర పైపులైను నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా ఇప్పటికే 3500 కిలోమీటర్ల మేర మాత్రమే నిర్మాణాలు పూర్తయ్యాయి. అదే విధంగా ఉమ్మడి జిల్లాలో 3,30,838ల క్షల నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకూ 2,లక్షల 10 వేలు మాత్రమే ఇచ్చారు.
నాణ్యత అంతంత మాత్రమే...
జిల్లాలో నడుస్తున్న మిషన్ భగీరథ పనులు అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. పెద్దవూర మండలంలో 36ట్యాంక్ లకు గాను 06 ట్యాంకుల నిర్మాణపనులు ఆగిపోయాయి. ఉమ్మడి మండలంలో 52 ఆవాసగ్రామాలుండగా ఇంతవరకు ఏ గ్రామంలో కూడా పనులు పూర్తి కాలేదు.ఏ ఒక్క తండాల్లో కూడా పనులు పూర్తి కాలేదు .పొట్టేవాణితండా, కుంకుడు చెట్టు తండా, నయినావనికుంటా తండా,పూలియా తండా,నిమానాయక్ తండా, గమ్యానాయకతండా ,బెట్టెలతాండ, ఇంకా అనేక గ్రామాల్లో ,తాండాల్లో పనులు నిలిచి పోయాయి.దీంతో తాగునీళ్లు లభించక చేతి పంపుల నీటిని తాగు తున్నారు. సాగర్ నియోజక వర్గం కృష్ణ పట్టెలో అనేక గ్రామాలు,తండాల్లో ఇంటింటికి పైపులైన్లు, ట్యాంక్ నిర్మాణ పనులు పూర్తి కాలేదు. తాగునీళ్లు లేక కష్ణ పెట్టె అల్లాడుతుంది.నాసిరకంగా పనులు,పైపులు వేయడంతో లీకై తాగునీళ్లు మురికి నీళ్లుగా మారుతున్నాయి.అనేక గ్రామాల్లో,ఎక్కడి గుంతలు అక్కడే వదిలి పెట్టారు.కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేయడంతో పనులు అస్త వ్యస్థం అయ్యాయి. పర్యవేక్షణాలోపం కారణంగా కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 10-20 గ్రామాలు మినహా ఎక్కడా మిషన్ భగీరథ పనులు పూర్తి కాలేదు. పూర్తయిన 20 గ్రామాల్లో కూడా నీటి విడుదల చేసే సమయంలో నాసిరకం పైపులు వేయడం వల్ల పైపులు పగిలి వచ్చే నీరు కూడా రాకుండా పోతుందని గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
త్వరలోనే పనులు పూర్తి
మిషన్ భగీరథ ,ఈ ఈ.. మోహన్ రెడ్డి
జిల్లాలో మరో రెండు నెలల్లో మిషన్ భగీరథ పనులు పూర్తి చేస్తాం. జిల్లాలో ట్యాంకు నిర్మాణ పనులు పూర్తి కావొస్తున్నాయి.అంతర్గత పైపులైన్ ల పనులు కూడా మరో నెల రోజుల్లో పూర్తి చేస్తాము.కరోనా వల్ల పనులు మూడు నెలలు ఆగిపోయాయి.పర్యవేక్షణ చేస్తున్నాం.
మా గ్రామంలో మిషన్ భగీరథ పనులు పూర్తి కాలేదు
: రమావత్ ప్రియాంక, సర్పంచ్ కుంకుడు చెట్టు తండా.
తండాలో మిషన్ భగీరథ పనులు పూర్తి కాలేదు. సంవత్సరం నుంచి పనులు నడుస్తున్నాయి. ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇవ్వలేదు. పైపులైన్ల ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. పనులు చేస్తున్నారు గానీ ఆ పనులు పర్యవేక్షణ చేపట్టడం లేదు. పైపులు పగులుతుంటే తవ్వి తీస్తున్నారు. కానీ నాణ్యమైన పైపులు మాత్రం వాడటం లేదు.
పాత పైపులైన్లకు కనెక్షన్ తొలగించారు
: రమావత్ శర్మన్ నాయక్ నయినా వాని కుంట తండా.
మా తండాలో ఇంటింటికి నల్లా కనక్షన్లు ఇవ్వలేదు.ట్యాంక్ వద్ద. మాత్రమే తాగునీరు వస్తుంది.గుంపులు,గుంపులుగా ఒకరి కొకరు. నెట్టుకొని నీళ్లు పట్టుకుంటున్నారు.పనులు ఇంకా పూర్తి కాలేదు.గుంతలు పూడ్చలేదు.సంవత్సరం దాటినా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.