Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మొక్కలు నాటకుండా పడేసిన వైనం
నవతెలంగాణ -ఆలేరు రూరల్
మండలంలో హరిహారం అభాసుపాలవుతోంది.మండలంలోని మదనపలి, శర్భనాపురం, కొలనుపాక ,గుండ్ల గూడెం గ్రామాల్లో హరితహారం మొక్కలు నాటకుండా రోడ్డుపై పడేశారు. ప్రభుత్వం హరితహారం మొక్కలు నాటి పర్యావరణం పరిరక్షణ కాపాడుకోవాలని చెప్తున్నప్పటికీ కొందరి నిర్లక్ష్యం వల్ల మొక్కలు రోడ్డుపై పడడంతో హరితహారం అభాసుపాలు అవుతుందని పలువురు అంటున్నారు.గ్రామానికి పది వేల మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని ప్రజా ప్రతినిధులకు అధికారులకు సూచనలు ఇచ్చినప్పటికీ అవేవి పట్టించుకోవడంలేదు. మొక్కలు నాటకుండా నిర్లక్ష్యం వహిస్తూ రోడ్డుపై మొక్కలను పడేస్తున్నారు. మండలంలోని చిన్న చిన్న గ్రామాలకు 10,000 మొక్కలు టార్గెట్ పెట్టకుండా 3000. 4000 మొక్కలు నాటాలని ప్రజాప్రతినిధులకు అధికారులకు సూచనలు ఇచ్చినప్పటికీ గ్రామానికి 500 వందల మొక్కలు నాటి చేతులు దులిపేసుకున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ నర్సరీలను గ్రామాలలో ఉండే ప్రభుత్వ నర్సరీలను అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.