Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
ప్రతి కుటుంబంలో అర్హులైన వారందరికి రేషన్కార్డులు ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎమ్డి.పాషా, బూర్గు కష్ణారెడ్డి డిమాండ్చేశారు. మంగళవారం మున్సిపల్ కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పటి నుండి పేదలకు కొత్త రేషన్కార్డులు జారీచేయడంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కరోనా కాలంలో ప్రతి కుటుంబానికి రూ.7500 ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన విధంగా రూ.1500 ఇవ్వాలని, 57 సంవత్సరాలు ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ సౌకర్యం కల్పించాలని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్చేశారు. అనంతరం ఆర్డీఓ సూరజ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు రొడ్డ అంజయ్య, నాయకులు బత్తుల శ్రీశైలం, బండారు నర్సింహా, గోశిక కరుణాకర్, ఉష్కాగుల రమేశ్, ఆదిమూలం నందీశ్వర్, చీకూరి ఈదయ్య, బొడ్డు అంజిరెడ్డి, చీరిక సంజీవరెడ్డి, జంగయ్య, ముత్యాలు, విక్రమ్, మల్లయ్య, చంద్రయ్య, రాములు పాల్గొన్నారు.