Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
కార్మికులు ఐక్యంగా ఉండి పోరాడాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం రైల్వే హమాలీ కార్మికులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైల్వేవ్యాగిన్ వద్ద పని చేసే హమాలీలు అనేక ఇబ్బందులెదుర్కొంటున్నారన్నారు. సరుకు ఎగుమతి, దిగుమతి సమయంలో సౌకర్యాల్లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైల్వేవ్యాగిన్ వద్ద రోడ్డు సౌకర్యం లేక గుంతలమయంగా ఉన్నాయని, దీని వల్ల వర్షం పడ్డప్పుడు నీటి నిల్వ ఉంటుంందన్నారు. ఆ ప్రదేశం దుర్గంధంగా తయారవుతుందని, దీని వల్ల కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. కార్మికులకు సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా నాయకులు డాక్టర్ మల్లు గౌతమ్రెడ్డి, తిరుపతి రాంమ్మూర్తి, దేశీరాంనాయక్, హమాలీ కార్మికులు పాల్గొన్నారు.