Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈవీఎంల ట్యాంపరింగ్తో గెలిచిన మంత్రి
- మాజీ మంత్రి దామోదర్రెడ్డి
సూర్యాపేట:కరోనా నిర్మూలనలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేటలో కరోనా నిర్మూలనలో విఫలమైన మంత్రి జగదీశ్రెడ్డిని కేసీఆర్ వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయే తప్ప కంట్రోల్ చేయడం లేదని ఇదంతా ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు.ప్రధానంగా టెస్టులు నిర్వహించకపోవడం వల్ల జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు.కరోనా నియంత్రణలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని స్పష్టం చేశారు.అదేవిధంగా కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరిగితే లక్ష మందితో పోలీస్ స్టేషన్ల ముట్టడికి రూపకల్పన చేస్తామన్ననారు.పోలీసులు చొక్కా లేని టీిఆర్ఎస్ కార్యకర్తలని ఆరోపించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం గురించి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసేందుకె భగవంతుడు తిరిగి తనను రోడ్డు ప్రమాదం నుండి బతికించాడన్నారు.ఇక నుంచి ప్రతి కార్యకర్తను ఆదుకుంటానని తెలిపారు.మంత్రి జగదీశ్రెడ్డి ఈవీఎం ట్యాంపరింగ్లతో గెలిచాడని నైతికంగా విజయం తనదేనన్నారు. అదేవిధంగా ప్రభుత్వం సెక్రెటరియేట్ ని కూల్చడం అన్యాయమన్నారు.ఒకవైపు ప్రజలు కరోనాతో ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా సెక్రటరియేట్ నీ కూల్చే పని లో ఉండటం విడ్డూరంగా ఉందన్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణారెడ్డి, డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్నయాదవ్, తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి గుడిపాటి నర్సయ్య, పీసీసీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు,ఐఎన్టీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండపల్లి సాగర్రెడ్డి,కాంగ్రెస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ చెంచల శ్రీనివాస్, చివ్వెంల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేములపల్లి వాసుదేవరావు, యువజన కాంగ్రెస్ నల్లగొండ పార్లమెంటు అధ్యక్షుడు కుమ్మరికుంట్ల వేణుగోపాల్, కౌన్సిలర్లు కక్కిరేణి శ్రీనివాస్, బైరు శైలేందర్గౌడ్, ఓబీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు రావుల రాంబాబు, నాయకులు తంగేళ్ళ కరుణాకర్రెడ్డి, బెంజారపు రమేశ్గౌడ్, నాగులవాసు, కుందమల్ల శేఖర్, నరేందర్నాయుడు, పిండిగ విజరుశబరినాథ్, సాయినేత,ఆలేటి మాణిక్యం, వెన్న మధుకర్ రెడ్డి పాల్గొన్నారు.