Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగో మాసంలోనూ క్షీణత
- జూన్లో 15శాతం ప్రతికూల వృద్ధి
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తిలో అత్యంత కీలకమైన 8 రంగాలు వరుసగా నాలుగో మాసంలోనూ అత్యంత పేలవ ప్రగతిని కనబర్చాయి. బొగ్గు, ముడి చమురు, న్యాచురల్ గ్యాస్, స్టీల్, సిమెంట్, విద్యుత్ తదితర మౌలిక వసతుల రంగాలు తీవ్ర ప్రతిలకూల వృద్ధిని నమోదు చేశాయి. గడిచిన జూన్లో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి ఏకంగా మైనస్ 15 శాతానికి క్షీణించిందని శుక్రవారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గణంకాలు వెల్లడించింది. 2019 ఇదే జూన్లో 1.2 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఎరువులు మినహా బొగ్గు, చమురు, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలు భారీగా పడిపోయాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో వీటి వాటా 40.27 శాతంగా ఉంది. గడిచిన నెలలో బొగ్గు ఉత్పత్తి 15.5 శాతం పడిపోయింది. ఇదే క్రమంలో ముడి చమరు (6%), సహజ వాయువు(12%), రిఫైనరీ ప్రొడక్ట్స్(8.9%), స్టీల్(33.8%), సిమెంట్(6.9%), విద్యుత్ రంగం 11% చొప్పున మైనస్ వృద్ధిని నమోదు చేశాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్-జూన్ కాలంలో ఈ ఎనిమిది ప్రాధాన్యత రంగాలు ఏకంగా 24.6 శాతం క్షీణించాయి. గతేడాది ఇదే కాలంలో 3.4 శాతం వృద్ధిని సాధించాయి.