Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : బీజేపీ నాయకులు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు(59) కరోనాతో మృతి చెందారు. గత కొద్ది రోజులుగా విజయవాడలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. మూడు వారాలు క్రితం కరోనా బారిన పడిన ఆయన ఏలూరు కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవడంతో వారం క్రితమే విజయవాడకు తరలించారు. కొద్ది రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. మాణిక్యాలరావు మృతికి సీఎం జగన్ ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. అధికార లాంఛనాలతో మాజీ మంత్రి అంత్యక్రియలు నిర్వహించాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ను సీఎం ఆదేశించారు. గత 20 రోజులుగా కరోనాతో బాధపడుతూ చికిత్స పొందుతున్న మాజీ మంత్రిని కాపాడుకోలేకపోవడం దురదృష్టమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. అతని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.