Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-తక్షణమే అణచివేయాలి : మాణిక్ సర్కార్
అగర్తలా : త్రిపురలో తిరిగి తమ ఉనికిని చాటుకోవాలని ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్ ఆందోళన వ్యక్తం చేశారు. వారి ప్రయత్నాలను వెంటనే అణచివేయాలని అన్నారు. సీపీఐ(ఎం) కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాబోయే త్రిపుర ట్రిబ్యనల్ ఏరియాస్ అటానమస్ డిస్ట్రిక్ కౌన్సిల్(టిటిఎడిసి) ఎన్నికల సమయంలో ఉగ్రవాదులు తమ కార్యకలాపాలు పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ' ఖోవారు జిల్లాలోని పలు ప్రాంతాలు, పశ్చిమ త్రిపుర జిల్లాలోని లెఫుంగా, బంగ్లాదేశ్కు సరిహద్దుగా ఉన్న ఉత్తర త్రిపురలోని పాణిసాగర్ సబ్ డివిజన్లలో విద్రోహ చర్యలకు పాల్పడేందుకు ఉగ్రవాదులు ప్రయతిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది' అని అన్నారు. తక్షణమే అటువంటి ప్రయత్నాలను అడ్డుకట్ట వేయాలని కోరారు. గత లెఫ్ట్నెంట్ ప్రభుత్వం అమలు చేసిన విధానాలు, కార్యక్రమాలను అసుసరించడం ద్వారా ఈ తిరుగుబాటు దారులను అణచివేయవచ్చునని అన్నారు.