Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఫ్తీ నిర్బంధం పొడిగింపుపై చిదంబరం
- షరతులతో కూడిన ఆఫర్ను తిరస్కరించడం సరైనదే
న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ నిర్బంధాన్ని మూడు నెలల పాటు పొడిగించడం చట్టాన్ని దుర్వినియోగపర్చడ, రాజ్యాంగ హక్కులపై దాడని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం విమర్శించారు. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదన్న షరతుతో విడుదల చేసేందుకు సిద్ధమని జమ్ముకాశ్మీర్ పాలనాయంత్రాంగం ఇచ్చిన ఆఫర్ను ముఫ్తీ తిరస్కరించడాన్ని ఆయన సమర్థించారు. ప్రజా భద్రతా చట్టం(పీఎస్ఏ) కింద ఆమె నిర్బంధాన్ని జమ్ముకాశ్మీర్ పాలనాయంత్రాంగం మరో మూడు నెలలు పొడిగించిన సంగతి తెలిసిందే. దీనిపై చిదంబరం ట్విట్టర్ ద్వారా స్పందించారు. పీఎస్ఏ కింద ముప్తీ నిర్బంధాన్ని పొడిగించడం...చట్టాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు రాజ్యాంగం ప్రతి పౌరునికి ఇచ్చిన హక్కులను హరించడమేనని, 61 ఏళ్ల మాజీ ముఖ్యమంత్రి, 24 గంటలూ భద్రతా దళాల పరిరక్షణలో ఉంటున్న ఆమె..పిఎస్ఎకు ఎలా విఘాతం కల్గిస్తారని ప్రశ్నించారు. ' షరతులతో కూడిన ఆఫర్ను ఆమె తిరస్కరించడం సరైనదే. ఆత్మగౌరవం కల్గిన ఏ రాజకీయ నాయకుడైనా దీన్ని తిరస్కరిస్తారు. పార్టీ జెండా రంగు ఆధారంగా ఆమె నిర్బంధాన్ని కొనసాగించడం హాస్యాస్పదం' అని ట్వీట్ చేశారు. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా మాట్లాడకూడదనే షరతును ఎందుకు ఆఫర్ చేశారని చిదంబరం ప్రశ్నించారు.
ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు దాఖలైన ఓ కేసులో హాజరవుతున్న న్యాయవాదుల్లో తాను ఒకడినని..ఆర్టికల్కు రద్దుకు వ్యతిరేకంగా మాట్లాడితే..తాను పిఎస్ఎకు ముప్పు కల్గించినట్లేనా? అని ప్రశ్నించారు.