Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీపై అశోక్ గెహ్లాట్ ఫైర్
జైసల్మేర్ : తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించిన రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.. ప్రధాని మోదీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజస్థాన్లో జరుగుతున్న ఈ 'తమాషా'కు స్వస్తి చెప్పాలన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు బీజేపీ నేతలు బేరసారాలను పెంచారన్నారు. తన శిబిర ఎమ్మెల్యేలతో జైసల్మీర్లో మకాం వేసిన ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. మా ఎమ్మెల్యేలను భద్రంగా కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామన్నారు. సచిన్ పైలట్ను పార్టీ హైకమాండ్ క్షమించిన పక్షంలో.. ఆయనను, ఆయన వర్గ రెబెల్ ఎమ్మెల్యేలను తిరిగి తమ శిబిరంలో చేర్చుకోవడానికి సిధ్దమేనన్నారు.