Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిరం భూమి పూజకు బీజేపీ అగ్రనేతలు ఎల్కె అద్వానీ, మురళీ మనోహర్ జోషికి ఇంకా ఆహ్వానం అందలేదు. అయితే, కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి, యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్లకు ఆహ్వానం అందింది.
ఆగస్ట్ 5న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరగనున్న విషయం తెలిసిందే. ప్రధాని మోడీ చేతులు మీదుగా ఈ కార్యక్రమం జరగనున్నది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎల్కే అద్వానీ గత వారం ఈ కేసుకు సంబంధించి సీబీఐ కోర్టులో విచారణకు వీడియో లింక్ ద్వారా హాజరయ్యారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అద్వానీ, జోషితోపాటు ఉమా భారతి కూడా ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ప్రస్తుతం కరోనా వైరస్ సమయంలోనూ 200 మంది అతిథులకు ఆహ్వానాలు పంపాలని గతంలో ట్రస్టు బోర్డు నిర్ణయించింది. కాగా, అయోధ్య పూజారికి కరోనా సోకినట్టు ఇటీవల వార్తలు కలకలం రేపాయి..