Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-అప్పటి కేంద్ర మంత్రి సుఖ్రామ్.. పశ్చిమ బెంగాల్ సీఎం జ్యోతిబసుల మధ్య సంభాషణ
- దీని ధర నిమిషానికి రూ. 8 పైనే
న్యూఢిల్లీ : భారత్లో మొట్టమొదటి మొబైల్ ఫోన్ కాల్కు 25 ఏండ్లు నిండాయి. ఈ ఫోన్ కాల్ 1995, జులై 31న అప్పటి కేంద్ర టెలికాం మంత్రి సుఖ్రామ్, పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి జ్యోతి బసు ల మధ్య
జరిగింది. హ్యండ్హెల్డ్ మొబైల్ ఫోన్లను ఉపయోగించి ఈ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఈ విధంగా ఫోన్లో ఇద్దరు వ్యక్తులు సంభాషించుకోవడం ఇదే మొదటిది కావడం గమనించాల్సిన అంశం. కాగా, ఆ సమయంలో మొట్టమొదటి నోకియా మొబైల్ ఫోన్లను(నోకియా 2080 లేదా నోకియా 350 లేదా నోకియా 880) ఉపయోగించారు. అలాగే, భారత్ మోడీ-టెల్ట్స్రా నెట్వర్క్ను ద్వారా కాల్స్ చేసుకోగలిగారు. కోల్కతాలోని రైటర్స్ బిల్డింగ్(అప్పటి కలకత్తా), న్యూఢిల్లీలోని సంచార్ భవన్ మధ్య ఈ కాల్ జరిగింది. ఆ సెల్యూలర్ కాల్.. కలకత్తాలో మొబైల్ నెట్ సేవలను ప్రారంభించింది. భారత్లో సెల్యూలర్ సేవలను అందించడానికి లైసెన్స్ పొందిన ఎనిమిది కంపెనీలలో మోడీ-టెల్ట్స్రా సంస్థ ఒకటి. నాలుగు మెట్రోపాలిటన్ నగరాలకు రెండు లైనెన్సులను పొందింది. కాగా, అప్పటికీ ప్రారంభ ఫోన్ కాల్ రేట్లు అధికంగా ఉన్నాయి. అవుట్గోయింగ్, ఇన్కమింగ్ కాల్స్ కోసం నిమిషానికి రూ.8.4 నుంచి ఉన్నాయి. గరిష్ట మొబైల్ ఫోన్ కాల్ ఖర్చు నిమిషానికి రూ.16.8 వరకు పెరిగింది.ఆ సమయంలో ఫోన్లు కూడా చాలా ఖరీదు ఉండేవి. వాటి ధర రూ.40వేల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది 25 ఏండ్ల ద్రవ్యోల్బణాన్ని జోడించిన తర్వాత.. నేటి మదింపులో రూ. 2 లక్షలకు పైగా ఉంటుంది.