Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి
న్యూఢిల్లీ :అయోధ్య రామాలయానికి ప్రధాని మోడీ చేసిన సహకారం ఏమీ లేదని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక టెలివిజన్ చర్చలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. 'ఆలయానికి సంబంధించిన వివాదాలు, చర్చంతా మేమే పూర్తిచేశాం. ఇందులో ప్రభుత్వం చేసిందేమీ లేదు' అని అన్నారు. మందిర నిర్మాణం ముందుకెళ్లడానికి మాజీ ప్రధానమంత్రులు, కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ, పివి నరసింహరావు, వీహెచ్పీ నాయకుడు అశోక్ సింఘాల్ చొరవ తీసుకున్నారని స్వామి వ్యాఖ్యానించారు.