Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోట్లు, ద్విచక్ర వాహనాల దహనం
- రెండు ముఠాల మధ్య తగాదాలన్న పోలీసులు
చెన్నై : చెన్నైలోని కడలూరులో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. స్థానిక సంస్థల మాజీ చీఫ్ సోదరుడు హత్యకు గురయ్యాడన్న ఆరోపణలపై తలంగుడ గ్రామంలో రెండు ముఠాలు ఘర్షణలకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బోట్లు, ద్విచక్ర వాహనాలకు ఆందోళనకారులు నిప్పంటించారు. ఈ ఘర్షణలకు కారణమైన 43 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆగంతకులు కొన్ని ఇళ్లకు కూడా నిప్పటించారని స్థానికులు చెబుతున్నారు. ఆస్తులను ధ్వంసం చేసి..నిప్పంటించి వారు పరారయ్యారని తెలిపారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక దళానికి కూడా వీలుపడలేదని చెప్పారు. గత ఏడాది నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఏర్పడిన విబేధాలే రెండు గ్రూపుల మధ్య ఈ రాజకీయ వివాదానికి దారి తీశాయని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘర్షణల అనంతరం 200 మంది భద్రతా సిబ్బందిని అక్కడ మోహరించారు. ప్రస్తుతం పరిస్తితి నియంత్రణలో ఉందని పోలీసులు తెలిపారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటన చోటుచేసుకోవడం ఇదే తొలిసారి.