Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-గడువు కోరిన హోం మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) నిబంధనలను రూపొందించేందుకు మరో మూడు నెలల వ్యవధి కావాలని హోం మంత్రిత్వ శాఖ కోరినట్లు అధికారులు తెలిపారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్గనిస్తాన్లోని ముస్లిమేతర మైనార్టీలకు దేశంలో పౌరసత్వం కల్పించేందుకు రూపొందించిన ఈ వివాదాస్పద సిఎఎ..ఎనిమిది నెలల క్రితం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సిఎఎను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చోటుచేసుకున్నాయి. గత డిసెంబర్లో దీనికి రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేశారు. ఇప్పుడు సిఎఎ సంబంధించిన నియమాలను రూపొందించేందుకు హోం మంత్రిత్వ శాఖ మరో మూడు నెలల వ్యవధి కావాలని కోరిందని, సంబంధిత కమిటీ ముందు అభ్యర్థన చేసిందని అధికారులు తెలిపారు.