Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-జనసేన అధినేత పవన్ కళ్యాణ్
అమరావతి : అమరావతి రైతులకు అండగా నిలబడాలనే సంకల్పం ఉంటే టిడిపి ఎమ్మెల్యేలు, కృష్ణా, గుంటూరు జిల్లాల వైసిపి ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి పోరాటం చేయాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఎసి) సమావేశాన్ని ఆదివారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అధికార, ప్రతిపక్షాలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, భూములిచ్చిన రైతులపై బాధ్యత ఉన్నా, ప్రత్యక్ష పోరాటం మొదలుపెట్టాలని సూచించారు. కరోనా నివారణ చర్యలు చేపట్టలేక రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. ఆస్పత్రుల్లో సరైన సేవలు లేవని, ఈ వైఫల్యాలు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రాజధాని వికేంద్రీకరణ పేరుతో ఓ క్రీడకు తెర తీశారని ఆరోపించారు. వ్యక్తిగత అజెండాలు, పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా రాజధాని ఉండదన్నారు. రైతులకు అన్యాయం చేయడంలో వైసిపి, టిడిపి రెండూ ఒకలాంటివేనని విమర్శించారు. వ్యక్తిగత అజెండాతోనే రాజధానిని మారుస్తున్నారని పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
రైతులు, ప్రజా సంఘాల ఆందోళనలు పట్టించుకోరా? 3 రాజధానుల వ్యవహారంపై
టిడిపి నేతల వ్యాఖ్యలు
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ చాలా రోజులుగా వివిధ రాజకీయ పార్టీలు, రైతులు, ప్రజా సంఘాల ఆందోళనలు సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టించుకోరా? అని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకటరావు, మాజీ మంత్రులు యన మల రామకృష్ణుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమా ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. అప్పుడో మాట ఇప్పుడో మాట మాట్లాడి ప్రజలను జగన్ మోసం చేశారన్నారు. టిడిపి ప్రభుత్వం లో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినపుడు మద్ద తిచ్చిన జగన్ ఇప్పుడు మాట మార్చడం సిగ్గుచేటని, మూడు రాజధానులు కాదు కదా... మూడు భవనాలను కూడా ఈ ప్రభుత్వం కట్టే పరిస్థితిలో లేదని కళా వెంకటరావు విమర్శించారు. పేదలకు రూ.5తో అన్నం పెట్టలేని ఈ ప్రభుత్వం మూడు రాజధానులను ఎలా నిర్మిస్తుందని ఎద్దేవా చేశారు. పరిపాలన వికేంద్రీకరణ, సిఆర్డిఎ చట్టం రద్దు బిల్లులను గవర్నరు ఆమోదించ డం బాధాకరమన్నారు. బిల్లులు ఆమోదం పొందినంత మాత్రాన వైసిపి ప్రభుత్వం సాధించేదేమీ లేదనీ, ఐదు కోట్ల ఆంధ్రుల తరఫున రాజధానిపై ఉన్నత న్యాయ స్థానాల్లో పోరాడుతామని స్పష్టం చేశారు. జగన్ ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యమని యనమల రామకృష్ణుడు విమర్శించారు. విశాఖలో పిన్టెక్ వ్యాలీ, మెడ్టెక్ జోన్ను నాశనం చేయడంతోపాటు అమరావతిలో 139 సంస్థలను పోగొట్టి వేలాది మందికి ఉద్యోగాలు లేకుం డా చేయడమేనా వైసిపి అభివృద్ధి? అని ప్రశ్నించారు. అభివృద్ధి చేసే ప్రభుత్వమే అయితే కోర్టుల నుంచి చీవా ట్లు తినేవాళ్లు కాదని ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో విశాఖకు టిడిపి పెంచిన ప్రతిష్టను 14 నెలల్లో వైసిపి సము ద్రంలో కలిపేసిందన్నారు. ఎన్టిఆర్ విగ్రహాలు ధ్వం సం చేయడం, పరిశ్రమలను తరిమేయడం, దళితులపై దాడులు, బిసిలపై తప్పుడు కేసులు పెట్టడమేనా? వైసి పి అభివృద్ధి అని ప్రశ్నించారు. రాజధాని రైతులను మో సం చేసిన కుట్రలో వైసిపి, బిజెపిలు భాగస్వాములు అని మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరో పించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని గవర్నరు వెనక్కి తీసుకుని తప్పును సరిచేసుకోవాలన్నారు. మరికొన్ని గంటల్లో చనిపోతాడని నేరుగా... Click here