Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 496కు కంటైన్మెంట్ జోన్లని కుదించిన కేజ్రీవాల్ సర్కారు
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
కేజ్రీవాల్ సర్కారు కషి ఫలిత%శీ%గా దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు కరోనా బాధితుల రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోంది. ఆదివారం రికవరీ రేటు 90 శాతానికి చేరినట్టు ఢిల్లీ సర్కారు మీడియాకి తెలిపింది. అదే విధంగా కరోనా వ్యాప్తిని అరికట్టే దిశలో విధించే కంటైన్మెంట్ జోన్ల సంఖ్య ను 715 నుంచి 496 కు తగ్గించినట్టు వెల్లడించింది. తొలిసారి ఒక్క రోజులో కరోనా తో మరణించిన వారి సంఖ్య అతి తక్కువగా 15 గా నమోదైందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కొత్తగా 961 మంది కరోనా సోకగా, 1,186 మందికి డిశ్చార్జ్ అయినట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఢిల్లీలో 10, 356 యాక్టీవ్ కేసులు ఉన్నాయన్నారు. ఇందులో 5, 663 మంది ఇంటి వద్ద, 3, 732 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు పేర్కొన్నారు. కరోనా నుంచి కేంద్ర హౌం మంత్రి అమిత్ షా త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.