Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సామ్నాలో శివసేన ఎంపి సంజరు రౌత్
ముంబయి : ఉద్యోగాల కల్పనతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించకపోతే ప్రధాని మోడీని రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేసే అవకాశం ఉందని శివసేన ఎంపి సంజరు రావత్ అన్నారు. కరోనా కారణంగా 10 కోట్ల మందికి పైగా జీవనోపాధిని కోల్పోయారని, 40 కోట్ల కుటుంబాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయని, శివసేన అధికార పత్రిక 'సామ్నా'లో పేర్కొన్నారు. వేతనాలపై ఆధారపడి జీవిస్తున్న మధ్య తరగతి ప్రజలు..ఉద్యోగాలు కోల్పోయారు.వాణిజ్య, పరిశ్రమలు రూ. 4 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశాయని ఆయన అన్నారు. ' ప్రజల సహనానికి ఓ హద్దు ఉంటుంది. ఆశలు, హామీలపై వారు జీవించలేరు. ఈ సంక్షోభం నుండి బయటపడటం కష్టమని ప్రధాని మోడీ సైతం అంగీకరించారు. వారి జీవితాల గురించి ఎవరూ ఆలోచించడం లేదు' అని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక సంక్షోభం, కరోనాను కట్టడి చేయడంలో వైఫల్యం కావడంతో ప్రధాని బెంజిమన్ నెతన్యాహును రాజీనామా చేయాలని ఇజ్రాయిల్ ప్రజలు డిమాండ్ చేస్తూ నిరసనలు చేపడుతున్నారని, భారత్లో కూడా ఇలా జరిగే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు.
బహుశా రాఫెల్స్ నిరుద్యోగాన్ని రూపుమాపుతాయోమో
ఆర్థిక సంక్షోభం, కరోనా పరిస్థితిపై కారణాన్ని ఆయన ఎత్తి చూపారు. ఫ్రాన్స్ నుండి ఇటీవల ఐదు రాఫెల్ జెట్ల రక్షణకు వాటిని నిలిపి ఉంచిన అంబాలా ఎయిర్ స్టేషన్కు చుట్టూ 144 సెక్షన్ను విధించారని, గతంలో రాఫెల్, సుఖోరు వంటి యుద్ధ విమానాలు దేశానికి వచ్చినప్పటికీ..ఇటువంటి చర్యలు ఎప్పుడూ జరగలేదని అన్నారు. బాంబులు, మిస్సెల్స్ను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ రాఫెల్స్ విమానాలు నిరుద్యోగాన్ని, ఆర్థిక సవాళ్లను రూపుమాపుతాయోమో? అని చురకలంటించారు. రాజస్తాన్లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు పలుమార్లు ప్రయత్నాలు జరిగాయని, అక్కడ రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా బంగారం ధరలు ఎన్నడూ లేనంత పెరగడంపై కూడా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా వ్యాఖ్యానించారని రౌత్ ప్రస్తావించారు. నిరుద్యోగం, సంక్షోభం గురించి ఎవరూ మాట్లాడరని, సంక్షోభమే అవకాశాలను గండికొడుతోందని చెప్పడం సులభమని, కానీ, ఈ సంక్షోభాన్ని ప్రజలు ఎలా ఎదుర్కొంటున్నారో ఎవరికీ తెలియదని అన్నారు. సీఎంకు కరోనా పాజిటివ్...Click here