Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసా గుతున్నది. ఇప్పటివకే దాదాపు 17 లక్షలపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 37 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని అన్ని జిల్లాలకు వ్యాపించగా, అందులో 200కు పైగా జిల్లాల్లో ఒక్కొక్క దాంట్లో వేయికి పైగా కేసులు గుర్తించబడ్డాయి. నగరాల్లోనూ కోవిడ్-19 బారినిపడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరగడంతో పాటు కరనా మహమ్మారితో చేస్తున్న యుద్ధయంలో ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది సైతం భారీగా కరోనా బారినపడ్డారు. వైరస్ దేశ ఆరోగ్య రంగాన్ని సవాలుగా మారింది. కరనా వెలుగు చూసినప్పటి నుంచే ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. కొన్ని దేశాలు కరోనా వ్యాప్తిని కట్టడిచేయగలిగాయి.
కానీ, భారత్లో కరోనా కట్టడిలో ప్రభుత్వం వైఫల్యం కావడానికి కారణాలు గమనిస్తే.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కరోనా గణాంకాలకు సంబంధించి వాస్తవాలను దాస్తున్నదని నిపుణులతో పాటు సామాన్యుల్లోనూ అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వ వైఖరీ సైతం ఇదే విధంగా ఉంది. ప్రధాని మోడీ ఇటీవల జరిపిన ''మన్ కీ బాత్''లో మాట్లాడుతూ.. మార్చి నుంచి తాము చేస్తున్న విషయాలను గురించి ఎక్కువ సమయం కేటాయిస్తూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే వాస్తవ విషయాలను ప్రస్తవించకుండానే.. కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలనీ చేబుతూనే.. భారత్లో కరోనా కేసులు, మరణాల విషయంలో ఇతర దేశాల కంటే మెరుగైన స్థితిలో ఉందని చెప్పుకురావటం గమనార్హం. ఈ విషయం వెల్లడిలో ప్రధాని బాధ్యతను సూచించినప్పటికీ.. ప్రస్తుత వాస్తవ విషయాలను గురించి వివరిస్తూ.. ప్రజలకు ధైర్యాన్ని, భరోసాను కల్పించలేకపోవడం గమనార్హం.
మరో విషయం కరోనా పరీక్షల పెంచుతుండటంతో కేసులు పెరుగుతున్నాని కేంద్ర మంత్రులతో పాటు, రాష్ట్రల ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులు చేబుతుంటంలో తప్పులేదు. కానీ ఎక్కువ సంఖ్యలో అనియంత్రితంగా కరోనా కేసులు పెరుగుతున్నాయనే విషయాన్ని ఖండించలేకపోయారు కరోనా వ్యాప్తిని గుర్తించలేకపోవడంతో పాటు.. ప్రజలను అప్రమత్తం చేయలేకపోయారు. దీనికి తోడు రోజుకూ 5 లక్షలకు పైడా కోవిడ్-19 పరీక్షలు చేస్తున్నామనీ కేంద్రం గొప్పలు చెబుతున్నది సరే కానీ, దీంట్లోనూ దారుణమైన లోపాలున్నాయి. ఎందుకంటే ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత అతన్ని కలిసిన వారిని గుర్తిస్తున్నారా? వారి వేరు చేస్తున్నారా? పాజిటివ్ వ్యక్తులందరినీ ఆస్పత్రుల్లో చేర్పిస్తున్నారా? హౌ క్వారంటైన్లో ఉంటున్నవారు బయట తీరగకుండా చూస్తున్నారా? అంటే ప్రభుత్వం వద్ద సరైన సమాధానం లేదనేది వాస్తవం. ఈ చర్యలనున బీచ్లో ఇసుక కోటలు కట్టడం లేదా జల్లెడలో నీరు పోయాడం లాంటి పనులనేది వాస్తవం. దీని కారణంగానే వీరి ద్వారా వైరస్ వ్యాప్తి అధికమవుతున్నది.
దీని వెనుక వ్యూహం ''పరీక్షా, ట్రాక్, చికిత్స'' అని ప్రభుత్వ వాదిస్తున్నప్పటికీ.. రాజకీయంగా ఒత్తిడిని తప్పించుకోవడానికేనని ఇటీవల పలు నివేదికలు వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ, కేరళ, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలు కాంటాక్టు ట్రేసింగ్, కరోనా రోగులు ఇతరులను కలవకుండా వుంచడంలో మెరుగైన చర్యలు తీసుకోవడంతో ఆయా రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తిని అడ్డుకట్ట వేశాయి.
మరో విషయం కరోనా కట్టడిలో ముందుండి పోరాడుతున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు కరోనా విషయంలో సరైన శిక్షణను కల్పించలేదు. దీని కారణంగా వారు వైరస్ బారినపడటంతో పాటు కరోనా వ్యాప్తికి కారణమైన సంగతి తెలిసిందే. వీరికి మెరుగైన రక్షణను కల్పించే విధంగా చర్యలు తీసుకోవడంలేదని కరోనా వారియర్స్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మరో ఘోరమైన తప్పిదం.. కార్మికులకు, ఉద్యోగులకు సరైన రక్షణ కల్పించకుండా తిరిగి పనులు చేసుకోవడానికి అనుమతినివ్వటం. పని ప్రదేశాలు, కార్యాలయాల్లో సామాజిక దూరం, ఇతర చర్యల గురించి మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి. కానీ పర్యవేక్షణ లేదు, సమీక్ష లేదు, ప్రజలకు అవగాహన కల్పించడానికి, మార్గనిర్దేశం చేసే ప్రయత్నమూ లేదు.
ప్రభుత్వం మాత్రం లాక్డౌన్ రూపంలో పరిమితులు తొలగింపు చర్యలు తీసుకుంటున్నది. దీనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ల నుంచి హౌం మంత్రి వరకూ పాలుపంచుకుంటారు, అమలు చేసేది పోలీసులే. ఈ నిర్వహణకు ఆర్థిక వ్యవస్థ సహాయం చేయలేదు. దీనికి తోడు దేశంలోని చాలా మంది పేదలు సామాజిక ఆర్థిక భద్రత, పోదుపులు లేకుండా ప్రమాదపుటంచున వారు పనిచేస్తారని ఆశించడం ఎల్లప్పుడు స్మారక నిష్పత్తిలో ముర్ఖత్వమే. కానీ ప్రజలు బయటకు వెళ్లకుండా వ్యాధి బారినపడకుండా ఉండటానికి సైతం ప్రభుత్వం వారికి ఆదాయ సహాయం చేయలేదు. చివరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ సడలింపుల పేరుతో ప్రజలను ప్రమాదపుటంచున నిలబెట్టాయి.