Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీ ఎస్ఇసీ నిమ్మగడ్డ
అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ద స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, రాగద్వేషా లకు అతీతం గానే ఎప్పుడూ వ్యవహరిస్తుం దని రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్కుమార్ అన్నారు. బందరు రోడ్డులోని ఎన్నికల కమిషన్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర గవర్నర్ నోటిఫికేషన్కు అనుగుణంగా హైదరాబాద్లో శుక్రవారమే బాధ్యతలను స్వీకరించడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్లకు సంబంధిత అధికారులకు ఎన్నికల కమిషన్ కార్యదర్శి వాణీ మోహన్ ద్వారా తెలియజేశామన్నారు.