Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తేల్చి చెప్పిన తమిళనాడు సీఎం
చెన్నై : కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన నూతన విద్యా విధానంలోని త్రిభాషా విధానం అమలు పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్రంలో ఈ విధానాన్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు. 'నూతన విద్యా విధానం (ఎన్ఇపీ)లో త్రిభాషా విధానాన్ని తీసుకురావడం విచారకం, బాధాకరం. ఈ ప్రతిపాదనపై ప్రధాని మోడీ పున:పరిశీలించి వారి విధానాలకు అనుగుణంగా రాష్ట్రాలకు అనుమతి కల్పించాలని' పళనిస్వామి ప్రకటనలో తెలిపారు.