Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత మహిళను ట్రాక్టర్తో ఢకొీట్టిన వైనం
గుంటూరు : గిరిజనుల పొలాన్ని కాజేయాలనే ఉద్దేశంతో ఓ పెత్తం దారు దళిత మహిళను ట్రాక్టర్తో ఢకొీట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందింది. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా నకరికల్లు మండలం శివాపురంతండాలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన రమావత్ మత్రూనాయక్, మంత్రుభారు (55) దంపతులకు ఆరుగురు కుమార్తెలు. తమకున్న 2.70 ఎకరాల పొలాన్ని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబ అవసరాలు, వ్యవసాయ పెట్టుబడి కోసం నరసింగపాడు గ్రామా నికి చెందిన బోనుముక్కల శ్రీనివాసరెడ్డి వద్ద రెండెళ్ల క్రితం పొలాన్ని తనఖా పెట్టి రూ.3 లక్షలు అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చాలంటూ మంత్రుభారు దంపతులపై ఒత్తిడి తెచ్చాడు. పొలం అమ్మి బాకీ తీరుస్తానని మంత్రుభారు చెప్పగా. నేను ఇచ్చిన అప్పునకు పొలం సరిపోతుందని శ్రీనివాసరెడ్డి చెప్పాడు. మంత్రూభారు తన పొలంలోకి వెళ్తుండగా, శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్తో ఢకొీట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమె నరసరావుపేట వైద్యశాలకు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.