Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జగన్కు 48 గంటల డెడ్లైన్
- మూడు రాజధానులపై బాబు సవాల్
అమరావతి : 'మూడు రాజధానుల ఏర్పాటు సరైన నిర్ణయమని భావిస్తే అసెంబ్లీని రద్దు చేయండి. అందరం కలిసి ప్రజల వద్దకు పోదాం. 48 గంటల సమయం ఇస్తున్నా. మా ఎంఎల్ఏలు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా రాజీనామాలు చేసి రండి. ప్రజల్లో తేల్చుకుందాం.' అని ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుద్దేశించి సవాల్ చేశారు. హైదరాబాద్లోని ఆయన నివాసం నుంచి సోమవారం ఆన్లైన్ ద్వారా విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన 'ప్రజాతీర్పు మూడు రాజధానులకు అనుకూలంగా ఉంటే మేం స్వాగతిస్తాం. నా సవాల్ను స్వీకరిస్తారా?' అని ప్రశ్నించారు. రాజధాని సమస్య ఏ ఒక్కరిదో, ఒక్క పార్టీదో కాదని, ఐదు కోట్ల ఆంధ్రులదని అన్నారు. ఎన్నికలకు ముందు మూడు రాజధానుల విషయం ప్రజలకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్ని తరువాత మూడురాజధానులు చేస్తామనడం సరికాదు. ఇది ప్రజలకు వెన్నుపోటు పొడవడం, మోసం చేయడమే' అని అన్నారు. అమరావతి రాజధాని విషయంలో రైతులకు అండగా నిలుస్తామని, ఒక వైపు న్యాయపోరాటం. మరో వైపు ప్రజాపో రాటం చేస్తామని అన్నారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన వైసీపీని ప్రజాకోర్టులో దోషు లుగా నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలన్నారు. జగన్ పరిపాలన తీరు పిచ్చి తుగ్గక్ పాలనలాగా ఉన్నదని అన్నారు. అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ సభ్యులు మాత్రమే ఉన్నారని, మిగి లిన రాజకీయపార్టీలు కూడా ప్రభుత్వాన్ని రాజీనామా చేయాలని డిమాండ్ చేయాలన్నారు.