Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరోః
ఇటీవల ఎగువసభ ఎన్నికైన పలువురు ఎంపీలకి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు వివిధ స్టాండింగ్ కమిటీలకు నామినేట్ చేశారు. ఇందులో భాగంగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ సోమవారం ప్రకటన విడుదల చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు బండ ప్రకాశ్ కు పేపర్ లెడ్ ఆన్ ది టేబుల్, కేఆర్ సురేష్ రెడ్డిలకి సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీలో చోటు దక్కింది. అలాగే వైసీపీ నుంచి విజయసాయి రెడ్డికి బీజినెస్ అడ్వైజరీ కమిటీలో నియమితులయ్యారు.