Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రూ.3వేల కోట్లు తిరిగి చెల్లించని సొమ్ము
- విమానయాన కంపెనీల తాత్సారం
న్యూఢిల్లీ : లాక్డౌన్ కాలం, ఆ తర్వాత సమయంలోనూ విమానయాన టికెట్లను రద్దు చేసుకున్న ప్రయాణికులకు తిరిగి ఆ సొమ్ము ఇవ్వడానికి విమానయాన కంపెనీలు అనాసక్తిగా ఉన్నాయని సమాచారం. దాదాపుగా రూ.3,000 కోట్ల వరకు ప్రయాణికులకు రిఫండ్స్ చేయాల్సి ఉన్నదని అంచనా. ప్రయాణికుల రిఫండ్స్ అంశం పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో విమానయాన కంపెనీలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. కాగా టికెట్లను రద్దు చేసుకున్న వారి సొమ్ముకు సమానంగా భవిష్యత్తు రోజుల్లో విమానయానం చేయడానికి అవకాశం కల్పిస్తామని ఆయా కంపెనీలు ప్రభుత్వ అధికారులతో పేర్కొన్నట్టు సమాచారం.