Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ప్రధాని అయోధ్య పర్యటన రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం : సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : అయోధ్యలో రామాలయం నిర్మాణానికి సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన ట్రస్టును.. తన పనిని తాను చేసుకోనివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సూచించింది. మొదట్నుంచీ తమ పార్టీ ఈ వివాదాన్ని చర్చల ద్వారా గానీ, న్యాయస్థానాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించిందని తెలిపింది. రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసిన నేపథ్యంలో.. యూపీ, కేంద్ర ప్రభుత్వాలు కలిసి అక్కడ భూమి పూజ కార్యక్రమాన్ని తమ స్వాధీనంలోకి తీసుకోవడాన్ని పొలిట్బ్యూరో తప్పుబట్టింది. ఈ కార్యక్రమా నికి ప్రధానితో పాటు అత్యున్నత స్థాయి వ్యక్తులు హాజరవడం సుప్రీంకోర్టు తీర్పు, రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని విమర్శించింది. బాబ్రీ మసీదును కూల్చడాన్ని కోర్టు తప్పుబట్టిందనీ, దాన్నో నేర చర్యగా తీర్పు చెప్పిందనీ, కానీ దానికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా వ్యవహరిం చడం లేదని పొలిట్బ్యూరో ఆరోపించింది. దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో మతపరమైన సమావేశాలు చేపట్టకూడదని కేంద్ర హౌంమంత్రి త్వశాఖ నిబంధనలున్న ప్పటికీ ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించడమేం టని ప్రశ్నించింది. లౌకికవాదం, రాజ్యాంగ సూత్రాలను పాటిస్తూ మహమ్మారి నివారణ ప్రోటోకాల్ను కచ్చితంగా పాటించాలని సీపీఐ(ఎం) ప్రజలకు సూచించింది. మతపర మైన రాజకీయాలను అనుమతించ వొద్దని పిలుపునిచ్చింది.
కాశ్మీర్ప్రజలకు సంఘీభావం
అరెస్టు చేసిన వారందరీని విడుదల చేయాలి : వామపక్ష పార్టీలు
న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకాశ్మీర్ రాష్ట్ర విభజన, జమ్ముప్రజలను నిర్భంధించిన ఘటనలకు 2020 ఆగష్టు 5తో ఏడాది పూర్తవుతున్న నేపధ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు సీపీఐ(ఎం) సంఘీభావం తెలిపింది. ఈ మేరకు సీపీఐ(ఎం)తో సహా వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఐ (మార్క్సిస్ట్-లెనినిస్ట్)- లిబరేషన్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అండ్ రివలూషనరీ సోషలిస్టు పార్టీ ఒక ప్రకటన విడుదల చేశాయి. గత ఏడాది ఈ సందర్భంలో కాశ్మీర్ ప్రజలకు ఎలాంటి లాభం ఉంటుందోనని మోడీ ప్రభుత్వం అనేక వాగ్ధానాలు చేసిందనీ, మరోవైపు కాశ్మీర్లో మోడీ దౌర్జన్య పాలన భారతదేశం యావత్తుకి బ్లూప్రింట్గా మారుతుందని చాలామంది హెచ్చరించారని ప్రకటనలో పార్టీలు గుర్తు చేశాయి.
అయితే ఒక ఏడాది తరువాత బంధించడం, నిశ్శబ్ధంగా ఉంచడంతో కాశ్మీర్ ప్రజలకు మోసాలు కొనసాగిస్తూ మోడీ వాగ్ధానాలు బహిర్గతమయ్యా యని ప్రకటనలో పార్టీలు విమర్శించాయి. ఆర్టికల్ 370, 35(ఎ) రద్దుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఇంకా విచారణలో ఉన్నదని తెలిపాయి. 2019 ఆగష్టు నుంచి నిర్భంధంలో ఉన్న వారందరీని తప్పనిసరిగా విడుదల చేయాలనీ, సమాచార వ్యవస్థలను పునరుద్ధరిం చాలనీ, ప్రజల స్వేచ్ఛా కదలికలకు అనుమతించాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు ఉపశమనం కలిగించడానికి మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొవడం, రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రజాస్వామ్య హక్కులు, పౌరస్వేచ్ఛను కాపాడటం.. రెండూ చాలా అవసరమని వామపక్ష పార్టీలు తెలిపాయి.