Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-దేశంలో కరోనా స్వైర విహారం
- ఒక్క రోజే 52,972 కేసులు, 771 మరణాలు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ మహమ్మారి స్వైర విహారం చేస్తున్నది. రోజువారీ కేసుల సంఖ్య 50 వేలు దాటుతున్నది. గడిచిన 24 గంటల్లో దేశంలో మళ్లీ అత్యధికంగా 52,972 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 771 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కలిపి మరణాల సంఖ్య 38,135కు చేరింది. మరోవైపు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,03,696కి చేరుకున్నది. ఇందులో 5,79,357 యాక్టివ్ కేసులు ఉండగా.. 38,135 మంది కరోనాతో మరణించారు. అటు 11,86,203 మంది వైరస్ నుంచి కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అత్యధిక పాజిటివ్ కేసుల జాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక నిలిచాయి. ఇక కోవిడ్ మరణాలు ఎక్కువగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల్లో సంభవించాయి.