Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
తెలుగు జర్నలిస్ట్ కుమారుడికి సివిల్స్ 77వ ర్యాంక్ సాధించారు. ఐఏఎస్ లక్ష్యసాధనలో తాను సాధించిన విజయాన్ని తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నట్టు ర్యాంకర్ కట్ట రవితేజ తెలిపారు. ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంక్ సాధించడంలో తల్లిదండ్రులే ప్రధాన కారణమని ''నవతెలంగాణ''తో ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు. హైదరాబాద్ కు చెందిన రవితేజ మంగళవారం విడుదలైన సివిల్ సర్వీస్ 2020 ఫలితాల్లో 77 వ ర్యాంక్ సాధించారు. మూడోసారి చేసిన ప్రయత్నం డబుల్ డిజిట్ ర్యాంక్ సాధించడం ఆనందంగా ఉందన్నారు. సమాజ సేవ, దేశ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తానని చెప్పారు. పేద ప్రజల అభ్యున్నతి, ప్రభుత్వ పథకాలు ప్రతి లబ్దిదారుడికి అందించడమే తన లక్ష్యమన్నారు. గత ఏడాది 349 ర్యాంక్ దక్కడంతో పోస్టల్ సర్వీస్ వచ్చిందన్నారు. దీంతో ఐఏఎస్ కావాలన్న తన లక్ష్యం నెరవేరలేదన్నారు. మరింత పట్టుదలతో చదివి ఈసారి 77 వ ర్యాంక్ సాధించానన్నారు. అయితే, ఓపెన్ కేటగిరిలో ఐఏఎస్ కు 72 వ ర్యాంక్ కట్ ఆఫ్ గా ఉందని అన్నారు. అయినప్పటికీ 77 వ ర్యాంక్ రావడం గొప్ప విషయమని, తప్పకుండా తనకు ఐఏఎస్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన తండ్రి కట్ట రమణ నాచారం ఇండిస్టీయల్ ఏరియాలో మ్యానిఫాక్చరింగ్ యూనిట్ నడుతున్నారని, తల్లి ప్రసూన జర్నలిస్ట్(ఆంధ్ర ప్రభ)గా పని చేసేవారని తెలిపారు. తన లక్ష్య సాధనలో సహాయం అందించిన గురువులు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు.