Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : టెలికం రంగంలోకి రిలయన్స్ జియో వచ్చిన తర్వాత అనేక నెట్వర్క్ కంపెనీలు మూత పడగా ఉన్న సంస్థలు తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురైతున్నాయి. ఇప్పటికే వొడాఫోన్, ఐడియా విలీనం తర్వాత భారీ సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి. తాజాగా వ్యయ నియంత్రణలో భాగంగా వొడాఫోన్ ఐడియా దేశవ్యాప్తంగా దాదాపు 1500 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. గత మేనెలలో తన టెలికాం సర్కిళ్ల సంఖ్యను 22 నుంచి 10కి కుదిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఎజిఆర్ బకాయిల చెల్లింపునకు తోడు ఇటీవలి కాలంలో ఆ కంపెనీ ఖాతాదారుల సంఖ్య కూడా తగ్గడం రెవెన్యూపై ఒత్తిడిని పెంచుతుంది. ముఖ్యంగా వోడాఫోన్ ఐడియాకు సంబంధించి నోకియా, ఎరిక్సన్, హువావే, జెడ్టిఇ 4జి పరికరాల కొత్త ఆర్డర్లు ఆలస్యం కావడంతో సంస్థ సంక్షోభంలో చిక్కుకుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.