Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్వర న్యాయం అందేలా ప్రభుత్వ చొరవ చూపాలి
- అంబేద్కర్ లా కాలేజీ 76వ వ్యవస్థాపక దినోత్సవంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
అత్యున్నత న్యాయస్థానం నుంచి కిందిస్థాయి కోర్టుల వరకు అన్ని స్థాయిల్లో కలిపి సుమారు మూడు కోట్లకు పైగా అపరిష్కృతంగా కేసులు ఉండటం విచారకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పారు. పెరిగిపోతున్న ఇలాంటి కేసుల విషయంలో ప్రభుత్వంతో పాటు, సుప్రీంకోర్టు, హైకోర్టు, న్యాయ మంత్రిత్వ శాఖలు దష్టిపెట్టాలని ఆయన సూచన చేశారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ న్యాయకళాశాల (ఆంధ్రా యూనివర్సిటీ) 76వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన వెబినార్లో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ... న్యాయస్థానాల్లో పెరుగుతున్న కేసులపై ఆవేదన వ్యక్తం చేశారు. కేసుల సంఖ్య పెరుగుతున్న కారణంగా న్యాయ ప్రక్రియ ఆలస్యమవు తోందన్నారు. తద్వారా సత్వర న్యాయం అందిం చలేమన్నారు. 'జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్' అన్న మాటను ప్రస్తావిస్తూ... కొన్ని సందర్భాల్లో అనవసరంగా కేసులను పొడిగించడం, వాయిదా వేయడం జరుగుతోందన్నారు. దీనిపై న్యాయ వాదులతో పాటు ఈ రంగంతో సంబంధమున్న ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఆలోచించాల్సిన అవసర ముందన్నారు. వినియోగంలో లేని 1600కు పైగా చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిందని ఆయన గుర్తుచేశారు. ఈ దిశగా మరింత కషి జరగాల్సి ఉందన్నారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పీఐఎల్) ఇటీవల.. ప్రయివేటు (వ్యక్తిగత) ప్రయోజన వ్యాజ్యా లుగా మారిపోతున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలోనూ చర్చ జరగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. నైతిక ప్రవర్తనను అలవర్చుకుని, నిర్భీతితో విధులు నిర్వహించాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
ఢిల్లీలో అతి తక్కువ కరోనా కేసుల నమోదు..
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా కరోనా వైరస్ బారిన పడే వారి సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు కేవలం 674 కేసులు మాత్రమే నమోదయ్యాయని ఢిల్లీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే, గత మూడు రోజుల నుంచి వెయ్యి కంటే తక్కువ సంఖ్యలోనే కొత్త కేసులు రికార్డవుతున్నాయని చెప్పింది. జూన్ చివరి వారంలో రోజుకు దాదాపు నాలుగు వేల కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. వైరస్ ప్రభావంతో ఒక్క రోజులో మరణించిన వారి సంఖ్య అతి తక్కువ 12 గా ఉందని ఢిల్లీ సర్కార్ వెల్లడించింది.