Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మొదటిస్థానం సాధించిన ప్రదీప్ సింగ్
- సత్తా చాటిన తెలుగు తేజాలు
న్యూఢిల్లీ: సివిల్ సర్వీస్ పరీక్ష-2019 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసింది. మొత్తం 829 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్టు తెలిపింది. ఈ ఫలితాల్లో ప్రదీప్ సింగ్ మొదటి స్థానం సాధించగా, జతిన్ కిషోర్, ప్రతిభా వర్మ ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ఎంపికైన వారిలో 304మంది జనరల్ కేటగిరీకి చెందిన వారేనని యూపీఎస్సీ వెల్లడించింది. నూతనంగా ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ కోటాలో 78 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఓబీసీ 251, ఎస్సీ 129, ఎస్టీ కేటగిరీలో 67 మంది ఉద్యోగాలు సాధించారు. మొత్తం 927 ఖాళీలకు గానూ పరీక్షలు నిర్వహించారు. మరో 182 మంది ఫలితాలను రిజర్వ్లో ఉంచినట్లు యూపీఎస్సీ తెలిపింది. మరో 15 రోజుల్లో మార్కులు జాబితాను తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్టు యూపీఎస్సీ పేర్కొంది.
సత్తా చాటిన తెలుగు తేజాలు
సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంచి ర్యాంకులను సాధించి తమ సత్తా చాటారు. పెద్దిటి ధాత్రిరెడ్డి (46), మల్లవరపు సూర్య తేజకు (76), కట్టా రవితేజ (77), ఎంవి సత్యసాయి కార్తీక్ (103), మంద మకరంద్ (110), తాటిమాకుల రాహుల్ రెడ్డి (117), కె. ప్రేమ్ సాగర్ (170), శ్రీ చైతన్య కుమార్ రెడ్డి (250), చీమల శివగోపాల్ రెడ్డి (263), బి. రాహుల్ (272), యలవర్తి మోహన్ కృష్ణ (283), ఎ. వెంకటేశ్వర్ రెడ్డి (314), ముత్తినేని సాయితేజ (344), ముక్కెర లక్ష్మీ పావన గాయత్రి (427), కొల్లాబత్తుల కార్తీక్ (428), ఎన్ వివేక్ రెడ్డి (485), నీతిపూడి రష్మితారావు (534), కోరుకొండ సిద్ధార్థ (566), సమీర్ రాజా (603), కొప్పిశెట్టి కిరణ్మయి (633) ర్యాంకులు సాధించారు.