Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఆర్థిక మంత్రిత్వ శాఖ రిపోర్ట్
న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడం బలహీనంగానే ఉన్నదని కేంద్ర ప్రభుత్వ శాఖ అంచనా వేసింది. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో వైరస్ను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న లాక్డౌన్లు ప్రతికూలతను పెంచుతున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన 'నెలవారి ఆర్థిక సమీక్ష'లో పేర్కొంది. మంగళవారం విడుదల చేసిన ఈ రిపోర్ట్ ప్రకారం.. ప్రభుత్వ, కేంద్ర బ్యాంక్ విధానాలతో ఏప్రిల్ తర్వాత ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలో ఉన్నది. అయినా కరోనా కేసులు పెరుగుతుండటం, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న లాక్డౌన్ నిబంధనలు, నిరంతరం పటిష్ట పర్యవేక్షణ వల్ల రికవరీ బలహీనంగా కొనసాగుతున్నది. దేశ వృద్ధిలో కీలకమైన టాప్ 12 రాష్ట్రాల్లోనే 85 శాతం కేసులు నమోదవుతున్నాయి. ఇందులోనూ 40 శాతం మహారాష్ట్ర, తమిళనాడులో చోటు చేసుకుంటున్నాయి. జులై ముగింపు నాటికి దేశంలో మొత్తంగా 5.6 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇంతక్రితం నెలతో
పోల్చితే 166 శాతం పెరుగుదల చోటు చేసుకున్నది. జులైలో అత్యధికంగా కర్నాటక, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్లో పెరిగాయి. కాగా.. ఏప్రిల్, మేతో పోల్చితే జూన్లో సూక్ష్మ గణంకాల సూచీలు కొంత మెరుగు అయ్యాయని ఈ రిపోర్ట్ పేర్కొంది. జీఎస్టీ వసూళ్లు, విద్యుత్ వినియోగం, సరుకు రవాణ, ప్రయాణికుల సంఖ్య, పెట్రోల్, డీజిల్ వినియోగంలో పెరుగుదల చోటు చేసుకుందని తెలిపింది. ప్రస్తుత ఏడాదిలో ప్రపంచ వృద్ధి రేటు 4.9 శాతానికి పడిపోనుందని ఐఎంఎఫ్ వేసిన అంచనాలను ఈ రిపోర్ట్ గుర్తు చేసింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ 7.6 శాతం క్షీణించొచ్చని ఓఈసీడీ పేర్కొన్న విషయం తెలిసిందే.