Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఈశాన్యన ఢిల్లీలో ఫిబ్రవరిలో చేపట్టిన నిరనసలు మతఘర్షణలకు దారితీయడానికి సంబంధించి ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అపూర్వానంద్ను రాష్ట్ర పోలీసులు విచారించారు. ఆయన మొబైల్ ఫోన్ను సైతం స్వాధీనపర్చుకున్నారు. సీఏఏ వ్యతిరేక నిరసనలకు మద్దతునిస్తున్న ఆందోళకారులను...హింసాత్మఘటనకు దారి తీసినవారిగా చూడటం బాధించిందని ఫ్రొఫెసర్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. న్యాయమైన, సమగ్ర విచారణ చేపట్టేందుకు ఢిలీ పోలీసు అధికారులకు స్వేచ్ఛనిస్తే... శాంతియుత నిరసనలను హింసాత్మకతంగా మార్చిన అసలైన నేరస్తులపై దృష్టిసారిస్తారని తెలిపారు. 59/2020 ఎఫ్ఐఆర్ ఆధారంగా తనను విచారించారని, అయితే ఈ ఎఫ్ఐఆర్ కింద జామియా మిల్లియా ఇస్లామియా కోర్డినేషన్ కమిషన్ మీడియా కో ఆర్డినేటర్ సఫోరా జర్గార్, ఇతర విద్యార్థులు, సామాజిక కార్యకర్తలను అరెస్టు చేసినట్లు తెలిపారు.