Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దర్యాప్తు లేకుండానే అధికారులపై చర్యలు
- జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం నిర్ణయం
జమ్మూకాశ్మీర్ : జమ్మూకాశ్మీర్లో ఎవరైనా అధికారులు దేశవ్యతిరేక చర్యల్లో నిమగమైతే ఎలాంటి దర్యాప్తు లేకుండానే వారిపై వేటు పడనున్నది. ఇందుకు ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతాధికారులూ ఏ మాత్రమూ మినహాయింపు కారు. జమ్మూకాశ్మీర్ ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ విషయం తెలిసింది. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బి.వి.ఆర్ సుబ్రమణ్యం నేతృత్వం వహించనున్నారు. అధికారులపై చర్యలతో పాటు వారిని సర్వీసుల నుంచి తొలగించే అంశాన్ని పరిశీలించి ప్రతిపాదనలు చేయాల్సిందిగా ఈ కమిటీని నియమించినట్టుగా తెలుస్తున్నది. కాగా, ఈ కమిటీలో జమ్మూకాశ్మీర్ హౌం సెక్రెటరీ, డీజీపీ, జనరల్ డిపార్ట్మెంట్స్తో పాటు న్యాయ విభాగాలకు చెందిన అడ్మినిస్ట్రేటివ్ సెక్రెటరీలు, అదనపు డీజీపీ(సీఐడీ)లు సభ్యులుగా ఉండనున్నట్టు సమాచారం. కాగా, ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేటికి ఏడాది పూర్తవుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా కేంద్రం ప్రోద్బలంతో యూటీ యంత్రాంగం ఏకపక్ష చర్యలకు పూనుకుంటున్నదని అధికారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.