Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-వాస్తవానికి దూరంగా విద్యావిధానం
- దేశ ప్రజల మనోభావాలు పట్టించుకోని వైనం
న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) దేశంలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఇందులో కొన్ని మార్పులు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఇది కలవరానికి గురి చేస్తోంది. విద్యను కాషాయీకరణం చేయడంలో భాగంగానే సంఫ్ు ఎజెండాకు పచ్చ జెండా ఊపుతూ మోడీ సర్కారు నిర్ణయం తీసుకున్నదని సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు, నిపుణులు ఆరోపిస్తున్నారు. వాస్తవాలను ఏ మాత్రం పట్టించుకోకుండా కేవలం తాము అనుకున్న విధంగానే విద్యావిధానాన్ని తీసుకురావాలన్న పంతం కేంద్రంలో కనిపిస్తున్నదని అంటున్నారు. ఇందుకు కారణం ఎన్ఈపీలోని ఒక అంశం. దీని ప్రకారం.. స్కూల్ పిల్లలకు 5వ తరగతి వరకు వారి మాతృభాష, ప్రాంతీయ భాషలో పాఠ్యాంశాలు బోధించాల్సి ఉంటుంది.
అయితే ఈ నిర్ణయం పైనే తీవ్ర చర్చపచర్చలు సాగుతున్నాయి. ఇంగ్లీషు మీడియంను భారత ప్రజలు కోరుకుంటున్నారు. పిల్లలు తమ మాతృభాషలోనే బాగా అర్థం చేసుకుంటారని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది తమ ప్రతిపాదన అని, ఈ విద్యావిధానం నిర్ణయంలో తల్లిదండ్రులు, ప్రజల సూచనలను పరిగణనలోకి తీసుకుంటే బాగుండేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాగా, కొన్ని రాష్ట్రాల్లో అక్కడి ముఖ్యమంత్రులు 'స్థానిక భాషా విద్య' కోసం తమ నిర్ణయాలను ప్రజలపై బలవంతంగా రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. నితీశ్, మమతా, యోగి వంటి సీఎంలు ఆ కోవలోకి చెందిన వారేనని నిపుణులు చెప్తున్నారు. రాజ్యాంగం ప్రకారం.. బలవంతం సాధ్యం కాదని అంటున్నారు. అయితే కేంద్రంలోనూ, దేశంలోని అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ తన రహస్య లక్ష్యాల్లో భాగంగానే ఈ విద్యా విధానాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ఇప్పుడు ఇంగ్లీషు అంతర్జాతీయ భాష. ఇంగ్లీషుకు
మనం అవసరం లేకున్నా.. ఆ భాషలో పట్టు, పరిజ్ఞాణం విద్యార్థులకు చాలా అవసరమన్నది సగటు భారతీయుడి వాదన. ఇంగ్లీషు మీడియం ప్రాముఖ్యతను కాదనలేమనీ, ఏదేనీ ఒక విషయంపై కావాల్సిన అధిక సమాచార సేకరణకు కానీ, విదేశాల్లో విద్యను అభ్యసించడానికి అవసరమయ్యే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలన్నా.. ఆంగ్లం తప్పనిసరని విద్యావేత్తలు, నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతమున్న విద్యలో మూలాలను కత్తిరించి వాస్తవాలను దూరం చేయడానికి ఒక వ్యూహంతో మోడీ సర్కారు ముందుకెళ్తున్నదనీ, దీని వెనుక రాజకీయ ప్రయోజనాలను కొట్టిపారేయలేమని నిపుణులు తమ అభిప్రాయాలను వివరిస్తున్నారు.