Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆయోధ్యలో రామమందిర భూమిపూజ నేపధ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మౌనం వీడారు. 'ఉత్తమమైన మానవీయ గుణాలతో మర్యాద పురుషోత్తమ రాముడుగా రూపాంతరం చెందాడు' అని బుధవారం ట్వీట్ చేశారు. 'రాముడంటే ప్రేమ, అతను ఎప్పుడూ ద్వేషంతో కనిపించడు. రాముడంటే న్యాయం. అతను ఎప్పుడూ అన్యాయం చేసినట్లు కనిపించడు' అని పేర్కొన్నారు. రాముడు అందరి వాడు అంటూ కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ మంగళవారం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్సింగ్, ఆ పార్టీ నేతలు దిగ్విజరుసింగ్, కమల్నాధ్, మనీష్ థివారీ, జితిన్ ప్రసాద్ తదితరులు రామ మందిర్ కోసం భూమి పూజకు ట్విట్టర్లో మద్దతు తెలిపారు.